telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీకి షాక్‌ ఇచ్చిన హీరో విజయ్‌..!

అందరూ అనుకున్నట్లే ఐదు రాష్ట్రాల్ల ఎన్నికల్లో ఎక్కువ హడావుడి ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో మాత్రం సందడి కనిపిస్తోంది. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడులో కోలీవుడ్‌ ఉండటం వల్ల అక్కడ ఉదయాన్నే రజనీకాంత్‌, అజిత్‌ లాంటి సినీ ప్రముఖులు వచ్చి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం పెంచుతున్నారు. అలాగే తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ అయిన డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఓటు వేయడానికి తమిళనాడు వచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కమ్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో తమిళిసై తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉండగా.. హీరో విజయ్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పాత మహాబలిపురం రోడ్డు, నీలాంకరైలో నివాసముండే హీరో విజయ్‌.. స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఇందుకోసం తన ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు సైకిల్‌పై రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం హీరో విజయ్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే.. బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా విజయ్‌.. సైకిల్‌పై వచ్చి ఓటు వేసినట్లు తెలుస్తోంది.

Related posts