ఉత్తరప్రదేశ్లో జరిగిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఆరు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా సమాజ్వాదీ రెండు స్థానాల్లో, బహుజన్ సమాజ్, కాంగ్రెస్ పార్టీలు చెరో స్థానంలో లీడింగ్లో ఉన్నాయి.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లు నెగ్గిన బీజేపీ.. ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నట్లు ధీమా వ్యక్తం చేసింది. కానీ కేవలం ఆరు స్థానాల్లో మాత్రం ఆ పార్టీ లీడింగ్లో ఉన్నది. మొత్తం 11 స్థానాల్లో.. బీజేపీ 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఒక స్ధానం మిత్రపక్షం అప్నాదళ్కు కేటాయించింది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మాత్రం అన్ని సీట్లలో పోటీ చేశాయి.
ఏపీ మ్యాప్ లో అమరావతి లేకపోవడానికి వైసీపీనే కారణం: యనమల