telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీ ప్రభుత్వానికి టీటీడీ రూ. 11 కోట్ల విరాళం!

tirumala temple

కరోనాపై పోరుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలను అందించారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి రూ. 19 కోట్ల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు రూ. 8 కోట్ల సాయాన్ని అందిస్తున్నామని, మిగిలిన రూ. 11 కోట్లను ఏపీ ప్రభుత్వానికి అందిస్తామని తెలిపింది.

దీంతో పాటు ప్రతి రోజు 20 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ వెల్లడించారు. ఉదయం నుంచి రాత్రి వరకు 20 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు ఆహారాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.

Related posts