telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆగష్టులో “వకీల్ సాబ్”?

కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ కారణంగా సినిమా షూటింగ్‌లు, థియేటర్లు బంద్ అయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత కొత్త విడుదల తేదీల గురించి చర్చించుకోవాలని టాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారట. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న `లవ్‌స్టోరీ`ని మే 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు మే నెలలో విడుదలవుతుండడంతో `లవ్‌స్టోరీ` రిలీజ్ వాయిదా పడినట్టు సమాచారం. జూలై నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. పవన్‌కల్యాణ్ `వకీల్ సాబ్` ఆగస్టుకు వాయిదా పడినట్టు సమాచారం. ఇంకా ఈ సినిమా షూటింగ్ కొంత మిగిలి ఉంది. లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారని తెలుస్తోంది.

Related posts