telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కాల్పులకు తెగబడ్డ పాక్.. ఇద్దరు జవానులు మృతి

kashmir police firing

సరిహద్దులో పాకిస్థాన్‌ మరోసారి కాల్పులకు తెగబడింది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్‌ సెక్టార్‌ వద్ద పాకిస్థాన్‌ కాల్పులకు పాల్పడగా ముగ్గురు భారత జవానులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ముగ్గురిలో ఇద్దరు జవానులు శనివారం ఉదయం మృతి చెందారు. మరొకరు కోలుకుంటున్నారు. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఏప్రిల్‌ 30వ తేదీన ఫూంచ్‌ జిల్లాలో పాక్‌ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. 

Related posts