telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పూర్తి వివరాలు ఇవ్వండి, ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ ఆదేశాలు

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి వివరాలు, సీడీలు సీల్డు కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాలని స్పష్టం చేసింది. అమరావతికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ్టి నుంచి రోజు వారీ విచారణ ప్రారంభమైంది.

మొదటి రోజు 15 పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రాజధాని వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. అన్ని కేసులపై స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది. విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తూ … ముఖ్యమంత్రి వసతి కోసం నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చెప్పాలని కోరినట్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.

Related posts