telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపిలో మళ్లీ పెరిగిన కరోనా.. ఈ జిల్లాల్లో ఆందోళనకరం..

corona

ఏపిలో కరోనా కేసులు లెక్కకు మించి వస్తున్నాయి.  గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 65,889 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,795 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 7,30 వేలకు చేరువలో ఉన్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు కాస్త ఊరట ను కలిగిస్తున్నాయి. ఈరోజు 30 మంది కరోనా తో మరణించారు.దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6,052కు చేరుకుంది.

 రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,29,307 పాజిటివ్ కేసులకు గాను, 6,72,479 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 50,776 మంది కరోనా వల్ల చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని విజ్ఞప్తి చేశారు..

Related posts