telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యయత్నం

New couples attack SR Nagar

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన వేల్పూర్‌ మండలంలో చోటుచేసుకుంది. రెండేళ్ల కూతురితో పాటు తనకు కూడా నిప్పంటించుకుని ఒక తల్లి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, కాలిన గాయాలతో తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. వేల్పూర్‌ మండలం పడగల్‌కు చెందిన మౌనికకు మూడేళ్ల కిందట నిజాంసాగర్‌​ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో వివాహం జరిగింది. అయితే మౌనిక ఉన్నట్టుండి మంగళవారం కూతురితో పాటు నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు మౌనికను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి మాత్రం మృతి చెందారు. మౌనిక పరిస్థితి విషమంగా ఉంది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts