telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వలసలండి .. వలసలు : తెలుగుదేశంలోకి గౌరు చరిత.. !

gouru charita into tdp on 9th

ఏపీలో నెలకొన్న రాజకీయ అనిచ్చితి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టత లేకపోవటంతో.. ఆయా పార్టీ నేతలు వలస పక్షుల మాదిరి ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ మధ్య తిరుగుతున్నారు. తాజాగా, ఈ నెల 9న టీడీపీ లో చేరబోతున్నానని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ మారనున్నట్టు ఆమె తెలిపారు. దుర్గా బోగేశ్వరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి, వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పునర్విభజన తరువాత ఓ మారు కాటసాని రాంభూపాల్ రెడ్డిని, మరోసారి చరితను ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. ఎవరు ఎలా పని చేస్తారో ప్రజలకు తెలిసిందని, రానున్న ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని వారే నిర్ణయించుకుంటారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తమవెంటే ఉన్నారని, 9వ తేదీన కార్యకర్తలు భారీగా తరలిరావాలని అన్నారు.

Related posts