వైసీపీ ప్రభుత్వ విధానాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి, నిరంకుశ ధోరణితో పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు తాను నిద్రపోనని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ నాశనం మొదలైందని చెప్పారు. ఇకపై వారికి రాష్ట్రంలో అధికారం ఉండదని అన్నారు. వైసీపీకి ఇదే తొలి, చివరి అధికారమని చెప్పారు. అమరావతికి భూములు ఇచ్చిన ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించారని, వారి శాపాలు ఊరికే పోవన్నారు. ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు వారి వినాశనం కోసమేనని చెప్పారు. రాజధానిని అమరావతి నుంచి ఎవరూ తరలించలేరని స్పష్టం చేశారు.
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల