telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడే నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన తిరుపతి పార్లమెంట్, నాగార్జున సాగర్ శాసన సభ స్థానాల్లో ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పటిష్ట భద్రత, కఠిన కరోనా నిబంధనల మధ్యే ఓట్ల లెక్కింపు జరుగనున్నాయి. ఇక పార్టీలు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం సాగర్ లో టీఆర్ఎస్, తిరుపతిలో వైసీపీ గెలుస్తాయని చెప్పేసాయి. అయితే విజేత ఎవరు అనేది మాత్రం ఇవాళ పగలు లోపు క్లారిటీ రానుంది. ఇది ఇలా ఉండగా అటు తమిళనాడు, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో కూడా ఇవాళ కౌంటింగ్ ఉండనుంది. దీంతో దేశ ప్రజలు ఎవరు గెలుస్తారు అని ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Related posts