అజిత్ ఇటీవలే “నెర్కొండ పార్వాయి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఖాకీ ఫేం హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగాగా, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్లు ముఖ్య పాత్రలలో కనిపించారు. లాయర్ పాత్రలో అజిత్ కనిపించి మెప్పించాడు. బోని కపూర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పింక్ రీమేక్ చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి “నెర్కొండ పార్వాయి” టీంతో కలిసి తన 60వ చిత్రం చేయబోతున్నాడు అజిత్. అజిత్ 60వ చిత్రం వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా, ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించనున్నారు. శుక్రవారం శ్రీదేవికి నివాళులు అర్పించి పూజా కార్యక్రమాలు జరిపారు. “వాలిమై” అనే టైటల్ని చిత్రానికి ఫిక్స్ చేసిన టీం మూవీని 2020 సమ్మర్లో విడుదల చేయనున్నారు. యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చనున్నాడు. నయనతారని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారట. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
After Superhit #NerKondaPaarvai #Thala #Ajith, Bollywood Top Maker @BoneyKapoor once again collaborated for #Ajith60 titled #Valimai. Movie launched with Pooja ceremony. Directed by #HVinoth @ZeeStudiosInt @BayViewProjOffl presentation #DOPNirav @thisisysr pic.twitter.com/o1n74VNzsS
— BARaju (@baraju_SuperHit) 19 October 2019
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీకి 503 సీట్లు..