telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2012 పాజిటివ్ కేసులు

Corona

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం 21,118 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,012 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 70,958కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2012 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 70,958కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 576కి చేరుకుంది. నిన్న కరోనా నుంచి 1139 మంది కోలుకోగా.. మొత్తం ఇప్పటి వరకూ 50,814 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 12,938 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 532 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 198, రంగారెడ్డి జిల్లాలో 188 కేసులు నమోదయ్యాయి.

Related posts