telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూర్ఖత్వంతో ముందుకెళ్తున్నావు..జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

ache Naidu tdp

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ‘శాసన మండలి రద్దు’ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శాసనసభ సమావేశాల్లో ఒక విధానంపై ఎజెండా ఉండేదని చెప్పారు. ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు బీఏసీ సమావేశం ఉందని టీడీపీకి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు.

‘ఇంతకు ముందు 33 బిల్లులు మండలికి పంపించారు.. మేం వ్యతిరేకించలేదు. వికేంద్రీకరణ బిల్లు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందుకే సెలెక్ట్ కమిటీకి పంపామని తెలిపారు. జగన్, నువ్వు మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నావు. ఏపీని నాశనం చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. ఇందుకు శాసనమండలి అడ్డుతగిలిందని దాన్ని రద్దు చేస్తున్నావని అచ్చెన్నాయుడు అన్నారు.

Related posts