telugu navyamedia
తెలంగాణ వార్తలు

జింఖానా క్లబ్ ఎన్నికల్లో అచ్యుతరామయ్య ప్యానెల్ ఘన విజయం

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జింఖానా క్లబ్‌ పాలకమండలి ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొత్తం 1350 మంది సభ్యులు ఉండగా వారిలో 896మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అచ్యుతరామయ్యకు చెందిన ప్యానెల్‌ మొత్తం భారీ మెజార్టీతో విజయం సాధించింది.

అధ్యక్షుడిగా అచ్యుత రామయ్య పావులూరి ఘన విజయం సాధించారు. ఆయనకు 587 ఓట్లు రాగా ప్రత్యర్థి డి.సాంబయ్యకు 304 ఓట్లు వచ్చాయి. కార్యదర్శిగా పోటీచేసిన నూతక్కి నాగకిషోర్‌కు 592 ఓట్లు రాగా అయన మీద పోటీచేసిన నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌కు 301 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డి చందుపట్ల, సంయుక్త కార్యదర్శిగా వీరమాచినేని సత్యనారాయణ, కోశాధికారిగా జూపల్లి సతీష్‌కుమార్‌ ఎన్నికయ్యారు.

వీరితో పాటు హరీష్‌కుమార్‌ గడ్డిపాటి. ఆర్‌.కృష్ణమోహన్‌, మోహన్‌ వడ్లపట్ల, సుధీర్‌కుమార్‌ అత్తలూరి, జీఎస్ఆర్‌సీ వర్మ (బాబీ), పి.వేణుగోపాల్‌రావు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. జింఖానా క్లబ్‌ను మరింతగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని, సభ్యులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని అధ్యక్షుడు అచ్యుతరామయ్య తెలిపారు.

Related posts