తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఓ సంచలనం. చిరంజీవికి దేశ వ్యాప్తంగానే కాదు… ప్రపంచ వ్యాప్తంగానూ అభిమానులు ఉన్నారు. చిరంజీవి ఎప్పుడు ఎంత జోరు మీద ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…రీ ఎంట్రీ తర్వాత ఆయనలో కొత్త జోష్ మాములుగా లేదు. ఇటీవలే ఆచార్య సినిమాను పూర్తిచేసిన చిరు.. ఆ తర్వాత వెంటనే.. గాడ్ ఫాదర్.. భోళా శంకర్ సినిమాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్లో పాల్గోంటూ బిజీగా ఉంటున్నారు.
సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని ..’లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అన్నారు. ‘భోళా శంకర్’ సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు. సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు చిరు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు.
అక్కినేని నాగచైతన్య… సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ను ఈరోజు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు… అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. చాలామంది ఎంగ్ స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్గా, కంపోసుడ్గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్ ఫాదర్కి కూల్ సన్ అని చిరు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తనకు రీమేక్ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి పేర్కొంది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. ఈ సందర్భంగా స్టేజ్పై చిరుతో సాయిపల్లవి వేసిన స్టెప్పులు హైలెట్గా నిలిచాయి.