telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ మంత్రి పదవి తనకు భిక్ష కాదంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. గులాబీ జెండాకు తామే యజమానులమని ఆయన నిన్న హుజూరాబాద్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఫోన్ చేయడంతో అంతా సైలెంట్ అయిపోయింది.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈటల వ్యాఖ్యలతో భూకంపం పుట్టిందని అందరం అనుకున్నామని… రాత్రి కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పౌరుషమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ అమెరికాలో బాత్‌రూమ్‌లు కడుగుతూ బతికిండని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Related posts