తెలంగాణలో పాలన ప్రజలు ఊహించినట్టుగా లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజెర్సీలో సోమవారం ఎన్నారైలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన బాగుంటే నిజామాబాద్లో ఆయన కుమార్తె కవిత ఎందుకు ఓడిపోతారని ప్రశ్నించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రకృతే ఆ పనులు చేసి పెడుతుందని అన్నారు. కొడంగల్లో తాను ఓడిపోతానని కానీ, మల్కాజిగిరిలో గెలుస్తానని కానీ తాను ఊహించలేదన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని కేసీఆర్ అంటున్నారని, మరి 50 శాతం ప్రైవేటీకరిస్తామని చెప్పారా? అని నిలదీశారు. ఉద్యమ సమయంలో కొడుకు, అల్లుడు వచ్చి పప్పన్నం తిని వెళ్లిపోయారని, బెంజ్ కారులో వచ్చిన కూతురు కవిత బతుకమ్మ ఆడి వెళ్లిపోయిందని అన్నారు. అంతమాత్రానికే తాము ఉద్యమంలో పాల్గొన్నామని చెబుతున్నారని విమర్శించారు. అలా అయితే, ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు తీసుకున్న వారి సంగతేంటని ప్రశ్నించారు.
నమో అంటే నరేంద్రమోదీ కాదు..నమ్మించి మోసం చేసే వాడు..