telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం .. కొత్తగా 2,579 మందికి పాజిటివ్‌

corona vairus

తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2579 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1752 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,670కి చేరింది. ఆసుపత్రుల్లో 23,737 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు 84,163 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 770కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 మంది కొత్తగా వైరస్ భారీన పడ్డారు.

Related posts