telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి తోట త్రిమూర్తులు రాజీనామా

thota thrimurthulu

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శుక్రవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్‌సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని పార్టీలు మారానన్నది ముఖ్యం కాదని, అభివృద్ధే తనకు ముఖ్యం అని త్రిమూర్తులు అన్నారు. తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కోరిన సమయంలో ఆనాటి ప్రభుత్వం సహకరించలేదని తోట త్రిమూర్తులు ఆరోపించారు.

తన నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి జీవో విడుదల చేసినా కూడ నిధులు మంజూరు చేయని విషయాన్ని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు. తన ఓటమికి టీడీపీ ప్రభుత్వం సహకరించని కారణమని ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని బాబును కోరినా కూడ ఆయన పట్టించుకోలేదని ఆయన విమర్శలు చేశారు.

Related posts