కరోనా ప్రభావం సినిమా రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమా షూటింగ్ కు అనుమతులు ఇవ్వడంతో తిరిగి షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ను ఎత్తివేశాక కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’ సినిమా షూటింగ్ నేడు (సోమవారం) రామానాయుడు స్టూడియోస్లో పునఃప్రారంభమైంది. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లు కల్యాణ్దేవ్, రచితా రామ్తో పాటు ఒక కీలక పాత్ర చేస్తున్న అజయ్పై కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించారు. కరోనా గైడ్లైన్స్ పాటిస్తూ షూటింగ్ జరిపామని చిత్ర బృందం తెలియజేసింది.
previous post