తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు, దారాలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన భక్తులు ఇటీవల తిరుమల వెళ్లి వచ్చారు.
ఇంటికి తిరిగి వచ్చాక లడ్డూలో వెంట్రుకలు, దారాలను చూసి వారు అవాక్కయ్యారు. ఈ విషయం నలుగురికీ పొక్కడంతో, భక్తులంతా తిరుమల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా లడ్డూలో మేకులు, తదితర వస్తువులు వచ్చిన విషయం విధితమే.