హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపుతోంది. ఆ స్టేషన్లో పనిచేస్తున్న సీఐ, ఎస్సై సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఇదే పోలీస్ స్టేషన్లో గతంలో 50 మందిద పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పోలీస్ స్టేషన్లో 9 మంది కానిస్టేబుళ్లు, సీఐ, ఓ మహిళా ఎస్సై కరోనా బారినపడటం కలవరపెడుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో పనిచేసే మిగతా సిబ్బందికి కూడా ఆందోళన మొదలైంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1498 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఆరుగురు కరోనాతో మృతిచెందారు. ఇదే సమయంలో 245 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735 కు చేరగా.. రికవరీ కేసులు 3,03,013 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1729 మంది మృతి చెందారు..
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని