కుటుంబ కలహాల కారంగా ఓ తల్లి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. కూకట్పల్లి పరిధిలోని బాలాజీనగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఓ ఫంక్షన్ విషయంలో దంపతుల మధ్య వివాదంతో వివాహిత ఇంతటి ఘోరానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.