telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేద పిల్లల చదువు గురించి ఆలోచించలేదు: వల్లభనేని వంశీ

Vamsi

గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేదపిల్లల చదువు గురించి ఆలోచించలేదని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద పిల్లల చదువు గురించి పట్టించుకోలేదన్నారు. ‘అమ్మఒడి’ని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక ‘మంచి సంస్కరణ’గా భావిస్తున్నానని అన్నారు. సీఎం జగన్ చదువు గురించి ఇంత విప్లవాత్మకమైన మార్పు తెచ్చారని ప్రశంసించారు.

మా పిల్లల్ని ఎక్కడ చదివించుకుందాం, వాడు ఎంత పప్పు అయినా స్టాన్ ఫోర్డ్ లో చదివించుకుందామా అని ఆలోచించారే తప్ప, పేద పిల్లల గురించి ఆలోచించలేదని విమర్శించారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై జరుగుతున్న చర్చలో చంద్రబాబు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ ని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts