telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మ‌హిళ‌ల‌ను అడ్డం పెట్టుకుని..నిత్యం ఏదో ఒక కుట్ర -కోడాలి నాని

*చంద్ర‌బాబు రాజ‌కీయంగా దిగ‌జారిపోయారు..
*మ‌హిళ‌ల‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేస్తున్నారు..

మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
ప్ర‌భుత్వంపై టీడీపీ నేతలు రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని కోడాలి నాని ఆరోపించారు…

గోరంట్ల మాధవ్‌పై ఫేక్ వీడియోతో కుట్ర చేశారని.. అదే వీడియోపై ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ మరో కుట్ర చేశారని కొడాలి నాని ఆరోపించారు.  తన రాజకీయ అవసరం కోసం చంద్రబాబు నాయుడు.. మతాలపైనా దుష్ప్రచారం చేస్తారని ఆరోపించారు.

గతంలో అసెంబ్లీ వేదికగా తన భార్యను ఏదో అన్నామని చంద్రబాబు ఏడుస్తూ డ్రామాలు క్రియేట్ చేశారు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా నీచ రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు అని ఆరోపించారు.

గోరంట్ల మాధ‌వ్ మ‌హిళ‌ల్ని వేధించిన‌ట్టో, ఇలా వీడియో కాల్ చేసి ఇబ్బంది పెట్టిన‌ట్టో ఒక్క ఫిర్యాదు చేయించినా విచార‌ణ జ‌రిపి అవ‌స‌ర‌మైతే అరెస్ట్ చేయిస్తామ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చెప్పింద‌న్నారు.

వీడియో ఫేక్ అని పోలీసులు చెప్పినా టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ ను నేరుగా ఎదుర్కోలేక ఇటువంటి వాటితో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో జగన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. జగన్ పథకాలు అందటం లేదని.. పాలన బాగోలేదని ఎవరూ అందోళన చేయటం లేదని.. జగన్ మీద క్షణం క్షణం విషం కక్కుతూ రాష్ట్రం నుంచి జగన్ ను వెల్లగొట్టాలని కొందరు కుయుక్తులు పన్నుతూ వచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్ధితి లేదని అన్నారుఅది ఫేక్ వీడియో అని పోలీసులు చెప్పినా టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని.. అధికారం కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని.. నీచ రాజకీయాలు చేస్తున్న ఆయనకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారని కొడాలి నాని అన్నారు.

Related posts