telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పాజిటివ్ వచ్చినవారి ఇంటికే మందు పంపుతాం : ఆనంద‌య్య‌

ఆనంద‌య్య‌ తన మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనంద‌య్య‌.. త‌న‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయ‌న‌.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుంద‌న్నారు.. అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని సూచించారు.. మీమీ ప్రాంతాలకే మందు పంపిస్తామ‌ని.. ముందుగా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ వచ్చినవారి కోసం 5 వేల ప్యాకెట్ల చొప్పున ఆదివారం లేదా సోమవారం రోజు పంపుతామ‌ని వెల్ల‌డించారు.. పాజిటివ్ రిపోర్ట్ చూపించి.. అక్క‌డే మందు తీసుకోవ‌చ్చు అన్నారు ఆనంద‌య్య‌.. ఇప్పటికే అధికారులు మందు పంపిణీకి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. కాగా, ఆనంద‌య్య మందు తీసుకున్న‌వారికి అంద‌రికీ న‌యం అయింద‌నే ప్ర‌చారంతో ఆ మందుపై అంద‌రికీ ఆస‌క్తి పెరిగింది.. ఆనంద‌య్య మందు పంపిణీ ఆగిపోవ‌డంతో.. అంతా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం మళ్ళీ మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాని తయారీ పనిలో పడ్డారు ఆనంద‌య్య‌.

Related posts