రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎదుర్కోలేకనే చంద్రబాబు కుట్ర చేశారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయించాలని మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసీని మేనేజ్ చేసే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని అన్నారు.
సీఎం జగన్ సుపరిపాలన చూసి బాబు ఓర్వలేకపోతున్నారని, జగన్ పై కన్నా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. షూటింగ్స్ చేసుకుంటూ ఎన్నికల రద్దు గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పవన్ ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు, కన్నా, పవన్ కల్యాణ్ లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.