*రెండు రైళ్లలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు ఫోన్ కాల్స్
*విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రైన్స్ను నిలిపేసి ముమ్మర తనిఖీలు
*లోకమాన్యతిలక్, కోణార్క్ ఎక్స్ ప్రెస్ తనిఖీలు..
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వస్తున్న రైళ్లలో బాంబులు పెట్టామంటూ ఆగంతకులు రైల్వే పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు.
దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు బాంబు స్క్వాడ్స్ సాయంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లోకమాన్యతిలక్ ఎక్స్ప్రెస్ రైలును కాజీపేటలో ఆపి, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలును చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆపి సోదాలు చేశారు.
పోలీసుల తనిఖీలు చూసి… రైళ్లలో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం అవుతుందో అని.. భయాందోళనకు గురై అయ్యారు.