telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ఘోర‌ రోడ్డు ప్రమాదం

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో విశాఖపట్నంలోని ఘోర రోడు ప్ర‌మాదం జ‌రిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దరి తెలుగుతల్లి ఫ్లైవోవర్‌పై జ‌రిగిన ప్ర‌మాదంలో యువకుడు, ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందారు.

వివ‌ర్లాలోకి వెళితే..

సంపత్‌ వినాయక గుడి వైపు నుంచి రైల్వేస్టేషన్‌ వైపు ప్రశాంత్‌ (22), రాధిక (17) బైక్‌పై అతి వేగంతో డివైడర్ ను ఢీకొట్టడంతో అదుపుతప్పి ప‌డిపోయారు. ఈ ఘటనలో ప్రశాంత్‌ తల డివైడర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రాధికను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ , ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మురళీనగర్‌ ప్రాంతానికి చెందిన రాధిక గా పోలీసులు గుర్తించారు. సీతమ్మధారలోని ఓ సెలూన్‌లో ప్రశాంత్‌ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts