telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాజీ ఎస్‌ఈసీ లేఖపై విచారణ జరిపించాలి: విజయసాయి

Vijayasai reddy ycp

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మాజీ ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రమేష్‌ కుమార్‌ హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని ఆరోపిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు విజయసాయి లేఖ రాశారు. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా చేసిన సంతకానికి, హోంశాఖకు రాసిన లేఖలో సంతకానికి మధ్య తేడా ఉందన్నారు.

ఆ లేఖను టీడీపీ నేతలు కనకమేడల, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్‌ సృష్టించారని ఆరోపించారు. ఈ తతంగమంతా ఎన్నికల మాజీ కమిషనర్‌ రమేష్‌ కుమార్‌కు తెలిసే జరిగిందన్నారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలన్నారు. లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలోపేర్కొన్నారు.

Related posts