telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి జగన్ వైరస్ పట్టుకుంది: నక్కా ఆనందబాబు

nakka anand on tdp party with nri's

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ వైరస్ పట్టుకుందని… ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదని దుయ్యబట్టారు. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో రైతులు చేస్తున్న ఆందోళనకు ఆనందబాబు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని ఉద్యమాన్ని మహిళలే నడిపిస్తున్నారని… వారిని చూసి ఇతర ప్రాంతాల వారు సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా అమరావతి కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాలకులు తప్పులు చేస్తున్నప్పుడు మేధావులు స్పందించాలని కోరారు. మేధావుల మౌనంతో రాష్ట్రానికి కీడు జరుగుతుందని అన్నారు.

Related posts