గవర్నర్ తమిళిసైతో బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సర్కార్ అవలంభిస్తోన్న వైఖరి, రైతుల ఇబ్బందులతో పాటు పలు అంశాలపై గవర్నర్తో నేతలు చర్చించారు.
వరి కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం, రైతుల ఖాతాలో జమ చేయాలని, విద్యుత్ చార్జీల పెంపుపై, జీవో 111 ఎత్తివేతపై గవర్నర్కు నేతలు ఫిర్యాదు చేశారు. . జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. .
ఈ భేటీలో రేవంత్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు.