సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ తొలి జాబితా ప్రకటించి ముందంజలో ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. మెజారిటి లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొంత మంది ఎంపికకు కసరత్తు చేస్తున్నారు.. వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
1. దువ్వాడ శ్రీనివాస్ (శ్రీకాకుళం)
2. బొత్స ఝాన్సీ (విజయనగరం)
3.ఎంవీవీ చౌదరి(విశాఖ)
4.వరుదు కల్యాణి(అనకాపల్లి)
5.గంజి అశోక్(కాకినాడ)
6.మార్గాని భరత్ (రాజమహేంద్రవరం)
7.చింతా అనూరాధ (అమలాపురం)
8.రఘురామకృష్ణంరాజు(నరసాపురం)
9.కోటగిరి శ్రీధర్ (ఏలూరు)
10.బాలశౌరి(మచిలీపట్నం)
11.లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట)
12.పెద్దిరెడ్డి మిథున్రెడ్డి(రాజంపేట)
13.వైఎస్ అవినాశ్రెడ్డి(కడప)
14.గోరంట్ల మాధవ్(హిందూపురం)
15.పి.డి.రంగయ్య(అనంతపురం)
16.బ్రహ్మానందరెడ్డి(నంద్యాల) అభ్యర్థిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంకా సుమారు తొమ్మిది స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది.