పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తుందని చార్మినార్ జోన్ మున్సిపల్ జోనల్ కమిషనర్ నామ సామ్రాట్ ఆశోక్ తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులను పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ హర్డ్వేర్, యానిమేషన్, సాఫ్ట్వేర్ డెవలపర్, డొమెస్టిక్ వాయిస్, డాటా సెర్చ్, ఎలక్ట్రికల్, ల్యాండ్ సర్వేయర్, స్టోర్ ఇన్చార్జి, ప్రమోటర్స్తో పాటు ఇతర విభాగాలలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా సూచించారు. ఇతర వివరాల కోసం 994888 9872, 9700670026 నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.