తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం 63933 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.