telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ మహిళలకు సీఎం జగన్‌ శుభవార్త.. ఫోన్‌ కొంటే రాయితీలు

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా అనేక పథకాలు తీసుకువచ్చింది జగన్‌ ప్రభుత్వం. అయితే.. తాజాగా మహిళలకు జగన్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొన్న మహిళలకు.. 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 8న సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొని.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే రూ 10 శాతం ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. మహిళల కోసం కోసం ఇప్పటికే అమ్మిఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌ ప్రభుత్వం.. మరో కోత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అలాగే నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు.

Related posts