ఎన్ని కుట్రలు చేసినా నన్ను ఏమి చేయలేరని ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. తన కల్యాణ మండపంలో కేసినో పెట్టానని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు గుడివాడలో అడుగు పెట్టే ధైర్యం లేదని..టీడీపీలో ఉండే పకోడీ గాళ్లు నన్ను ఏం స్తారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. తాను బతికుండగా అక్కడ చంద్రబాబుతో సహా ఎవరూ కాలు పెట్టలేరని సంచలన వ్యాఖ్యలు చేసారు.
గుడివాడలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల రాకను నిరసిస్తూ శుక్రవారం వైసీసీ శ్రేణులు ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు కొడాలి నాని. .సంక్రాంతి పండగకి జూదం, కోడిపందేలు అన్నిచోట్ల జరిగినట్లు గుడివాడలో కూడా జరిగింది. గుడివాడలో మహిళలకు తీసుకొచ్చి డ్యాన్స్లు వేస్తున్నారని సమాచారం అందండంతో తానే డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని చెప్పారు.
వర్ల రామయ్య లాంటి సత్తా లేని నేతలను నిజనిర్ధారణకు పంపారంటేనే టీడీపీ స్టాండర్డ్ ఏంటో తెలుస్తోంది. తన కన్వెన్షన్ ఎలాంటిదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని.. టీడీపీ నుంచి నిజనిర్ధారణ కమిటీ లాంటివి సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. అవసరమైతే ఏం జరుగుతుందో మీడియా వెళ్లి చూస్కోవచ్చని చెప్పారు.
చంద్రబాబు టైమ్ అయిపోయిందని, మహిళలను అడ్డం పెట్టకుని రాజకీయాలు చేసే ఘనత టీడీపీ మాత్రమే చెందుతుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. తాను గుడివాడలో లేని సమయంలో వీళ్లందరూ కలిసి కట్టుగా కుట్ర చేసారంటూ ఫైర్ అయ్యారు.