నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. గతేడాది క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలైన ఈ సినిమా వి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నిఅందుకుంది.
కోల్ కతా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించారు.ముఖ్యంగా నాని, సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం ‘శ్యామ్ సింగరాయ్’చిత్ర బృందాన్ని అభినందించారు.
దీనికి సంబంధించిన ఫోటోని నాని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ‘శ్యామ్’ ఎవరికి నచ్చాడో కనిపెట్టండి? అంటూ ట్వీట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే మెగాస్టార్ తో కలిసి దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు..ఇందులో మెగాస్టార్, నేచురల్ స్టార్ ఇద్దరూ మీసం మెలేస్తూ కనిపించారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన శ్యామ్ సింగరాయ్.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీకి ఇచ్చాడు. ఈ రోజు నుంచి (జనవరి 21)ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
♥️ @KChiruTweets https://t.co/mB3uh2aJoC pic.twitter.com/xNjm7Rzyfc
— Nani (@NameisNani) January 20, 2022