telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఏపీలో  మరో ఘోరం చోటుచేసుకుంది. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌తో చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో ఓ యువకుడు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను మాకవరపాలెం యువకులు హేమంత్‌, అనీశ్‌, హర్హిత్‌గా గుర్తించారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మోటారు సైకిల్‌పై వేగంగా వెళుతున్న ముగ్గురూ అదుపుతప్పి చెట్టకు బలంగా ఢీకొట్టారు. దీంతో హేమంత్‌ అక్కడిక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. విషయం తెలిసిన పోలీసులు… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో తమ పిల్లలు మృతిచెందిన విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు..విషాదంలోకి వెళ్లారు.

Related posts