telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటక రాజకీయ సంక్షోభం పై స్పందించిన స్పీకర్‌

Ramesh kumar speaker

కర్ణాటక రాజకీయ సంక్షోభం పై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్ కుమార్‌ స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తనకెలాంటి సంబంధం లేదని చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా తన అపాయింట్‌మెంట్‌ కోరలేదని తెలిపారు. ఒక వేళ ఎవరైనా తనను కలవాలనుకుంటే కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Related posts