తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ ఎన్నికల ఇంచార్జీల నియామకం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నాగార్జునసాగర్లో నిర్వహించింది. ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోపంతో మైక్ విసిరేశారు. మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జీల నియామకంలో పార్టీ నిర్ణయంపై జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఇంచార్జీలుగా కొనసాగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను ఇద్దరు సీనియర్ నేతలు వ్యతిరేకించారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయన ప్రస్తావించారు. దీంతో అగ్రహంతో జగ్గారెడ్డి తన చేతిలో ఉన్న మైక్ను వేదికపైకి విసిరికొట్టాడు.
శ్రీమంత్ పాటిల్ లేఖపై అనుమానాలు వ్యక్తం చేసిన కర్ణాటక స్పీకర్