ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడం పట్ల టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. కరోనా పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి, బాధితుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
కాగా, రోజువారీ కేసుల నమోదులో జాతీయ స్థాయిలో ఏపీ రెండో స్థానానికి చేరింది. ఒక్క రోజులోనే 7,998 కేసులు, 61 మంది మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 24 గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.