telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ..మా రోడ్లను కాస్త ప‌ట్టించుకోరూ

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ట్విట్టర్ వేదికగా కార్టూన్ కౌంటర్ వేశాడు. రోడ్ల పరిస్థితిని కూడా కాస్త పట్టించుకోండి అంటూ సెటైర్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. జగనన్న ‘ఉయ్యాలా-జంపాలా’ పథకంలో భాగమే ఈ రోడ్లని సోషల్ మీడియా వేదికగా రోడ్ల దుస్థితిని షేరు షేస్తూ మీమ్స్, సెటైర్స్ వెల్లువెత్తుతుంటాయి. మానాడే మారెల్లంటే…నేడు కూడెల్లని… అసలే రోడ్లు దారుణమంటే… కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ దారుణంగా మారిపోయాయి. దీనిమీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఓ కార్టూన్ కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా పవన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొని మరీ గెలిపించాలని కోరారు. అయితే అదే పవన్ కల్యాణ్ ఆత్మకూరు ఉప ఎన్నికను మాత్రం లైట్ తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో ఒక్క జనసేన జెండా కూడా ఎగరలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ‘గోదావరి గర్జన’ పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కూడా పవన్‌కు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలు బీజేపీ, జనసేన మధ్య రాజకీయంగా దూరం పెరిగిందనే అనుమానాలకు తావిచ్చాయి. తాజాగా.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్‌కు ఆహ్వానం అందకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంగా గ్యాప్ పెరిగిందనే వాదనకు బలం చేకూర్చింది.

Related posts