telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నరసరావుపేట పార్లమెంట్ టిడిపి కార్యదర్శిగా వకీల్ సాబ్ (సయ్యద్ వహాబ్)…

నరసరావుపేట పార్లమెంట్ టిడిపి కార్యదర్శి గా నియమితులైన MBT వహాబ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు టిడిపి నాయకులు. టిడిపి పార్లమెంట్ కార్యదర్శిగా నియమితులైన కృషి చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారికి అభినందనలు తెలియజేసిన MBT సయ్యద్ వహాబ్ గారు వారు మాట్లాడుతూ… నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అందించిన మా ప్రియతమ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు గారికి అలానే నా సోదరులు సోదరీమణులు క్షేమం కోరుకునే మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నిరంతరం ప్రతి పార్టీ అడుగు జాడల్లో నడుస్తాను. ఆయన ఆశయాలతో ప్రజల్లో టిడిపి గుండెల్లో ఉండే విధంగా పని చేస్తాను. అలానే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ ప్రజల క్షేమం ప్రజల బాగు కోసం మా నాయకుడు మాటతో నడుచుకుంటానని తెలియపరుస్తున్నాను అన్నారు.

వహాబ్ గారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ కరిముల్లా గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్, ఎడ్లపాడు జడ్పిటిసి అభ్యర్థి హిందూపురం సమన్వయకర్త పావులూరు శ్రీనివాసరావు, చిలకలూరిపేట మండల అధ్యక్షులు జవాజి మదన్ మోహన్ గారు నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారు, యాసీన్ గారు, ఆరికట్ల కోటేశ్వరరావు గారు, కొండ శీను గారు, శీను గారు, ఎస్ఎంఎస్ సుభాని గారు, మద్దు మాల రవి గారు, ముల్లా కరిముల్లా గారు, అడ్వకేట్ లాయర్ బ్రహ్మానందం గారు, రసూల్ గారు దామర్ల మనోహర్ గారు, మద్ది బోయిన శేఖర్ గారు, పిల్లి కోటి గారు, జాకీరి, జాకీర్ గారు, అడ్వకేట్ శివ కుమార్ గారు, తదితర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts