telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ తర్వాత ఇలా ఉండొచ్చు: కేటీఆర్ సరదా ట్వీట్

KTR TRS Telangana

లాక్ డౌన్ తర్వాత అందరి కార్యకలాపాలు ఇలా ఉండొచ్చన్న ఊహ జనించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రతి ఒక్కరూ తమలో తాము ఇలా ఆలోచించే అవకాశం ఉందంటూ వివరించారు.

“ఇక్కడెవరూ సజీవంగా బయటపడే పరిస్థితి లేనందున మరో ఆలోచన దిశగా మిమ్మల్ని మీరు నడిపించుకోవద్దు. మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. రుచికరమైన ఆహారం భోంచేయండి. సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ హాయిగా నడవండి.

సముద్రంలో దూకండి. హృదయాన్ని ఓ పెన్నిధిలా పొదివిపట్టుకు తిరుగుతున్నామన్న సత్యాన్ని చాటిచెప్పండి. అప్పుడప్పుడు సిల్లీగా ఉండండి. కొంచెం దయతోనూ వ్యవహరించండి. మరికొంచెం విచిత్రంగానూ ఉండండి. ఇంకేదీ వదిలిపెట్టేందుకు సమయం లేదు. అన్ని ఇప్పుడే చేసేయండి” అంటూ సరదాగా ట్వీట్ చేశారు.

Related posts