లాక్ డౌన్ వేళ అతి వేగంగా బైక్ నడపడం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే బైక్ నడిపిన వ్యక్తి తప్పించుకోగా.. వెనక కూర్చున్న వ్యక్తి ఆ వేగానికి బలైపోయాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉంటే ఇనుప గేటు ఈ యువకుడి ప్రాణాలు తీసింది. వేగంగా బైకర్ను ఆపాలని దూరం నుంచే పోలీసులు సూచికలు చేయగా.. వినకుండా దూసుకొచ్చేశారు. దీంతో జరగాల్సింది జరిగిపోయింది. అసలేం జరిగిందంటే..శనివారం ఇద్దరు యువకులు బైక్పై దండేపల్లి నుంచి జన్నారం వైపు వెళ్లారు. అదే సమయంలో తపాల్పెట్ చెక్పోస్ట్ వద్ద గేటును కిందకు దించారు. ఈలోపు దూరం నుంచి బైక్ వేగంగా రావడాన్ని అక్కడే ఉన్న కాపలా పోలీసులు గమనించారు. బైక్ ఆపాలని చేతులతో పలుసార్లు సైగలు చేశారు. అయినా వారు వినలేదు. బైక్తో వేగంగా దూసుకొచ్చేశాడు. దగ్గరికి వచ్చాక గేటును చూసి బైక్ నడుపుతున్న వ్యక్తి కిందికి వంగగా వెనక ఉన్న వ్యక్తి గేటుకు తగిలి ఎగిరిపడ్డాడు. అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.