telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 18న ఏపీ కేబినెట్.. 20న అసెంబ్లీ సమావేశం!

jagan

ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. అలాగే ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలను చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు సూచించిన అంశాలు, సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

కేబినెట్ సమావేశంలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. జీఎన్ రావు, బీసీజీ కమిటీ ఇచ్చిన నివేదికలు, హైపవర్ కమిటీ సిఫారసులు, పాలన వికేంద్రీకరణపై మరోసారి దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Related posts