అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమిళనాడులో పొలిటికల్ జంపింగ్లు కొనసాగుతున్నాయి… ముఖ్యంగా డీఎంకే నేతలను బీజేపీ టార్గెట్ చేస్తూ… పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ గూటికి చేరగా.. తాజాగా.. తాజాగా డీఎంకే బహిష్కృత నేత, మాజీ ఎంపీ కేపీ రామలింగం… బీజేపీ కండువా కప్పుకున్నారు. చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీలో చేరిన ఆయన.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే అధినేత స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరిని కూడా బీజేపీలోకి తీసుకొచ్చి తీరుతానని చెప్పుకొచ్చారు రామలింగం.. అళగిరితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తుచేసుకున్న ఆయన.. త్వరలోనే అళగిరిలోని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ డీఎంకే నుంచి ఇటీవలే రామలింగంను సస్పెండ్ చేసింది పార్టీ.. దీంతో.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి నుంచే అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతుంది.చూడలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.
previous post
మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు… నిహారిక పెళ్ళిపై నాగబాబు కామెంట్స్