telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాక్ కాల్పుల్లో మరో జవాన్ మృతి…

బోర్డార్లో పాకిస్తాన్ ఆగడాలకు రోజురోజుకి అదుపులేకుండా పోతుంది. ప్రతిరోజు భారత జవాన్లపై కాల్పులు జరుపుతూ భారత జవాన్లను పొట్టనపెట్టకుంటుంది. అయితే ఇటువంటి సంఘటనే మళ్లీ జమ్ము-కాశ్మీర్ దగ్గర రాజౌరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎల్ఓసీ వద్ద పాకీస్తాన్ జరిపిన కాల్పుల్లో భారత జవాను మరణించారు. అతడు రాజౌరీ నౌషేరా సెక్టార్‌కు చెందిన జవానుగా గుర్తించారు. అంతేకాకుండా మరో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. హావ్ పాటిల్ సంగ్రం శివాజీ మరణించగా కోలాపూర్‌కు చెందిన మరో జవాను గాయాలపాలయ్యారు. ‘శివాజీ ఎంతో ధైర్యశాలి, అతడు ఎందరికో ఆదర్శం అంేకాకుండా చాలా సిన్సియర్ అని లిఫ్టినెంట్ దేవేందర్ ఆనంద్ పేర్కొన్నారు. అయితే పాకీస్తాన్ నిబందనలను ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదని, మరో సారీ ఇదే తరహాలో చేస్తే తగ్గా బుద్ది చెబుతామనీ అన్నారు. అయితే ఏ మధ్యే కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనల పై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ కు సరైన బుద్ధి చెప్పాలని అంటున్నారు.

Related posts